
తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్: రానున్న రెండు రోజులు వానలే వానలు!
వాయువ్య బంగాళాఖాతం నుండి పశ్చిమ బెంగాల్ మరియు ఉత్తర ఒడిశా తీరాల మీదుగా ఏర్పడిన అల్పపీడన ప్రాంతం ప్రభావంతో రుతుపవన ద్రోణి కొనసాగుతోందని వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ వాతావరణ పరిస్థితుల కారణంగా రానున్న రెండు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం , శ్రీకాకుళం , విశాఖపట్నం, ఏలూరు , నెల్లూరు , మరియు తిరుపతి జిల్లాల్లో ఈరోజు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
అలాగే, తెలంగాణ రాష్ట్రంలో కూడా పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడొచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
కొన్ని ప్రాంతాల్లో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.





